సబితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బడంగ్ పేట్ కార్పొరేషన్ టిఆర్ఎస్ అభిమానులు మంత్రికి

Published: Thursday May 06, 2021
బాలపూర్, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణా విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి గారి నివాసము లో కలిసి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. మంత్రి గారి జన్మదినం సందర్భంగా కార్పొరేషన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా మహమ్మారి  జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.