మృత్యుంజయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజపాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల

Published: Friday August 27, 2021

మధిర, ఆగష్టు 27, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయ ఆవరణలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం ఆలయ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు దంపతులు భూమి పూజ నిర్వహించి వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ సాంప్రదాయం మేరకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు కమిటీ మరియు ఘన స్వాగతం పలికారు మృత్యుంజయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాచుర్యం ప్రత్యేకతల నేపథ్యంలో ఆలయం అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు దాతల తోడ్పాటు తో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఎంపీపీ  లలిత ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరావు ఏఎంసి చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు రైతు సమన్వయ సమితి కన్వీనర్ వేణు సొసైటీ చైర్మన్ బిక్కీ ప్రసాద్ పాటు మున్సిపాలిటీ కౌన్సిలర్ లు