కన్నుల పండుగగా తాళ్లపెంటలో సెమీక్రిస్మస్ వేడుకలు.. *హాజరైన బిషప్ డేవిడ్ సుదర్శనం, ప్రిన్సిప

Published: Saturday December 24, 2022
కల్లూరు, డిసెంబర్ 23 (ప్రజాపాలన న్యూస్): 

కల్లూరు మండలంలోని తాళ్లపెంట బైబిల్ మిషన్ కళాశాలలో గురువారం రాత్రి సెమీ క్రిస్టమస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బిషప్ ఎండీ సుదర్శనం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా భిషఫ్ మాట్లాడుతూ  ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్క జీవకోటికి యేసుక్రీస్తు మార్గమే ఆదర్శనీయమన్నారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. తొలుత కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు బిషప్  డేవిడ్ సుదర్శనం, ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ లను శాలువాలు పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీసిసి మండల కార్యదర్శి పాస్టర్ మోజేష్ డానీ, రవికాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.*