లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలి : మూడవ అదనపు న్యాయమూర్తి నారాయణ బాబు
Published: Thursday July 01, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 30 (ప్రజాపాలన) : జిల్లా కేంద్రంలోని ఈనెల 10 వ తేదీన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి నారాయణ బాబు తెలిపారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ పడేలా ప్రయత్నం చేయాలని న్యాయవాదులకు సూచించారు. అదేవిధంగా పర్సనల్ లోక్ అదాలత్ నిర్వహించేలా అనే విషయంపై చర్చించినట్టు తెలిపారు. అంతకుముందు సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోనగిరి సతీష్ బాబు మాట్లాడుతూ జూలై నెల మొత్తం వరకు కోర్టులో పర్చ్ హాల్ గా నడపాలని న్యాయవాదుల అభిప్రాయాన్ని తీసుకొని తీర్మానం చేసినట్లు తెలిపారు. సమావేశంలో న్యాయవాదులు విద్యాసాగర్, కిషోర్, రాకేష్, శ్రీనివాస్, రవీందర్ చంద్రకుమార్, ప్రసాద్ లు పాల్గొన్నారు.
Share this on your social network: