పీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్ కి వైయస్సార్ టిడిపి ఆధ్వర్యంలో ఘన సన్మానం

Published: Friday October 07, 2022

బోనకల్, అక్టోబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ పిసిసి సభ్యులుగా ఎన్నికైన పైడిపల్లి కిషోర్ కుమార్ కు మండల వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైయస్సార్ టిడిపి మండల అధ్యక్షులు ఇరుగు జానేష్, ఆళ్లపాడు గ్రామ అధ్యక్షులు కందుల వెంకయ్య మాట్లాడుతూ పిసిసి సభ్యులు కిషోర్ కుమార్ మనోభావాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి కిషోర్ కుమార్ అని వారు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా పని చేసి అన్ని పార్టీలకు స్నేహ సంబంధాలు పెంచుకుంటూ మంచి గుణమున్న నాయకుడు కిషోర్ కుమార్ ఆయన మంచితనంతో బోనకల్ మండలంలో ప్రతి ఒక్కరికి రాజకీయ గురువుగా తప్పులు తప్పని ఏలు ఎత్తిచూపే నాయకుడు అందుకే మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆయన మంచితనాన్ని గురించి దసరా శుభాకాంక్షలు గా వైయస్సార్ తెలంగాణ పార్టీ కిషోర్ కుమార్ కు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇరుగుజానేసు, మండల అధికార ప్రతినీదీ మర్రి ప్రేమ్ కుమార్, ఆళ్ళపాడు గ్రామ అధ్యక్షుడు కందుల వెంకయ్య, మండల నాయకుడు రాయనపేట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.