ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు . ... యాచకులకు పండ్ల పంపిణీ

Published: Friday December 16, 2022
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 15, ప్రజాపాలన : 
 
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను గురువారం మంచిర్యాల పట్టణంలో 
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వాటర్ ట్యాంక్ చౌరస్తాలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంచిర్యాల వాసవి క్లబ్స్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ,పట్టణ ఆర్యవైశ్య సంఘం ,పట్టణ ఆర్యవైశ్య వాసవి యువజన సంఘం నాయకులు సంయుక్తంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .  అలాగే అంతర్జాతీయ వాసవి క్లబ్ పిలుపు మేరకు మంచిర్యాల సాయిబాబా ఆలయం వద్ద భిక్షాటన చేసుకునే యాచకులకు పండ్లు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు ముక్త శ్రీనివాస్,  జిల్లా ప్రధాన కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, వాసవి క్లబ్ క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్ , వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలమాసు ప్రవీణ్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్ , జోన్ చైర్మన్ కాచం సతీష్,  పట్టణ వైశ్య సంఘం కార్యదర్శి అంచూరి నగేష్, కోశాధికారి ముస్య్తాల శ్రీనివాస్ ,  యువజన సంఘం అధ్యక్షుడు కంభంపాటి కమలాకర్ , కార్యదర్శి తణుకు శ్రీనివాస్ , నాయకులు కొత్త రాజేశం ,  రాజేంద్రప్రసాద్,  ఎర్రం వెంకటేష్ , చిలువేరు మహేష్ , రావుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.