మల్లాది వాసు సేవలు అభినందనీయం

Published: Thursday May 06, 2021
మధిర, మే 5, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణంలో కరోనా సోకిన రోగులకు లైన్స్ క్లబ్ చైర్మన్ మల్లాది వాసు సవిత దంపతులు బుధవారం ఏర్పాటు చేసిన అన్నదానాన్ని శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా కోఆర్డినేటర్ కోనా మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో అనేకమంది కరోనా బారినపడి సకాలంలో భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సమయంలో మల్లాది వాసు సవిత దంపతులు ప్రతిరోజు కరోనా సోకిన వారందరికీ వారివారి నివాసాలకు వెళ్లి కోడుగుడ్డు పుల్కాతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాది వాసు తనయుడు మల్లాది నిశాంత్ చౌదరి, మల్లాది సేవాసమితి నిర్వాహకులు మోదుగు బాబు ఆవుల కృష్ణ గూడేల్లి నాగరాజు రవి తదితరులు పాల్గొన్నారు.