సమస్థ మానవాళి సమానత్వం కమ్యూనిస్టు లక్ష్యం
Published: Friday November 04, 2022
MCPI(U) పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లేపు ఉపేందర్ రెడ్డి*
శేరిలింగంపల్లి -ప్రజా పాలన /(నవంబర్ 3) న్యూస్ :MCPI(U) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 3,4 తేదీలలో రెండు రోజుల పాటు మియాపూర్,ముజాఫర్ ఆహ్మద్ నగర్ లో సామాజిక,రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా మొదటి రోజు శిక్షణ తరగతుల కు హజరు అయినా MCPI(U) పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లేపు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుత దోపిడీ,పెట్టుబడి దారీ వ్యవస్థ ను నిర్మూలించి దీని స్థానంలో సమస్థ మానవాళి సమానత్వం సాడించేదే కమ్యూనిస్టు లక్ష్యం మని అనారు.దేశంలో సామ్రాజ్యవాద అండతో పెట్టుబడి దారీ వ్యవస్థ బలపడిందనీ,పెట్టుబడి దారుల వారి ఆర్థిక విధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ప్రభుత్వాల అనాలోచిత పానాలల వలన నేడు ప్రజలు హక్కులు కోల్పోతున్నారని అన్నారు. ధరల భారాలు పెరుగుతున్నాయి. విద్యా,వైద్యం, కూడు,గూడు సామాన్యులకు అందుబాటులో లేని వ్యవస్థ కొనసాగుతున్నదని ఆరోపించారు. పెట్టుబడి దారీ వ్యవస్థ కు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని,సమస్త ప్రజలు సమానంగా ఉండే వ్యవస్త ను సాధించే కమ్యూనిస్టు లక్ష్యయాన్ని బలపర్చలని పిలుపునిచ్చినారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సామాజిక, రాజకీయ శిక్షణ తరగతులలో మొదటి రోజు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుండి MCPI(U) సభ్యులు హాజరు అయినారు.
Share this on your social network: