భారతీయ జనతా యువమోర్చా పట్టణ శాఖ కార్యవర్గ సమావేశం
Published: Wednesday June 16, 2021
కోరుట్ల, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా యువమోర్చా పట్టణ శాఖ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశం బిజెనైఎం పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ప్రవీణ్ సింగ్ అధ్యక్షతనా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం నికి బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్ గార్లుముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది జగదీష్ గారు మాట్లాడుతూ యువమోర్చాను గ్రామా స్థాయి నుంచి బలోపేతం చేయవలసిందిగా కోరడం జరిగింది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంశ్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ల వలసిందిగా కోరడం జరిగింది పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం దీపావళి వరకు ఇవ్వడం అనేది పేదప్రజలకు అందించడం చాలా గొప్ప నిర్ణయం అని అన్నారు మరియు సురక్ష భారత్ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈనెల 21 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాల్సింది కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మడవేని నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు, మల్యాల మారుతీ, జిల్లా కార్యదర్శి సాడిగే మహేష్. జిల్లా కోశాధికారి రంజిత్ రెడ్డి, బీజేవైఎం జగిత్యాల పట్టణ అధ్యక్షుడు రవితేజ, బీజేవైఎం సీనియర్ నాయకులు గుండేటి సంజీవ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్, ధామ శ్రవణ్, ఉప అధ్యక్షులు గొనేలా రాజశేఖర్, రాధారపు శివ, కాసుల వంశీ, కంఠం శ్రీనివాస్, సాయికృష్ణ, వోటరీకరి నవీన్, కార్యదర్శులు వాసాల సంతోష్. మిట్టపల్లి వెంకట సాయి, అక్కినపెల్లి ఆకాష్, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: