మృతుల కుటుంబాలకు పరామర్షించిన జువ్వాడి

Published: Friday November 18, 2022

కోరుట్ల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేమిళ్ల మల్లారెడ్డి  రమేష్ తండ్రి, కట్కాకం రాజు వాళ్ళ కూతురు ఇటివల కాలంలో మరణించగా గురువారం రోజున వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు పరామర్శించారు.అనంతరం  జోగన్ పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ పల్లికొండ నరేష్  తల్లి  బుధవారం రోజున అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు పరామర్శించారు.వారి వెంట పైడిమడుగు గ్రామ సర్పంచ్ ధమ్మ బీమారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు జనార్దన్, యువజన కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సైదు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్డండి మోహన్ రెడ్డి, స్వామి రెడ్డి, తెలు శ్రీను, రాంమోహన్ తదితరులు ఉన్నారు.