మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Friday June 03, 2022
బోనకల్, జూన్2 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా తెలంగాణ బోర్డర్ సరిహద్దులో ఉన్న  అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ నందు ఉన్న జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  మండల టిఆర్ఎస్ పార్టీ  కార్యాలయం నందు మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు  జెండాను ఆవిష్కరించారు. అదే విధంగా మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ రావూరి రాధిక, మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, బోనకల్ పోలీస్ స్టేషన్ నందు ఎస్సై తేజావత్ కవిత, స్నేహాంజలి మండల సమైక్య కార్యాలయం నందు అజ్మీరా సోనీ, బోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ భూక్యా సైదా నాయక్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, పార్టీ  కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, రైతు బంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్, మాజీ జెడ్పిటిసి భానోత్ కొండ, గ్రామ పంచాయతీ కార్యదర్శి దామళ్ల కిరణ్, ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ, వార్డు మెంబర్ మరీదు శ్రీనివాసరావు, తెలుగుదేశం నాయకులు నందమూరి సత్యనారాయణ, బొబ్బిలి నరసింహారావు, బిజెపి మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు,వైస్  ఎంపీపీ గూగులోత్ రమేష్ , జానకిపురం సర్పంచ్ చిలక వెంకటేశ్వర్లు, మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొనకంచి నాగరాజు, రైతు సంఘం అధ్యక్షుడు కాకాని శ్రీనివాసరావు, కార్మిక సంఘం అధ్యక్షుడు బంధం నాగేశ్వరావు, ముస్లిం మైనార్టీ సంఘం అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం, మండల కమిటీ సభ్యులు పార ప్రసాద్, తన్నీరు పుల్లారావు, తన్నీరు రవి, దారగాని నారాయణ, వెనిగళ్ళ మురళి, ఇటుకల శ్రీనివాసరావు, షేక్ సైదా, కొమ్మినేని సత్యనారాయణ, రేగళ్ళ వీరయ్య, యనమద్ది శ్రీనివాసరావు, రంగా జనార్దన్, అనంత రాములు, భూపతి రావు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.