సుద్దాల సతీమణి అంత్యక్రియల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి జువ్వాడి కృష్ణారావు

Published: Tuesday June 07, 2022

కోరుట్ల, జూన్ 06 ( ప్రజాపాలన ప్రతినిధి ):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కరీంనగర్ జిల్లా పరిషత్  మాజీ చైర్మన్ సుద్దాల దేవయ్య సతీమణి  లత అంత్యక్రియలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు లు హాజరయ్యారు. దేవయ్య సతీమణి అనారోగ్యం తో ఆదివారం రోజున హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు. సుద్దాల స్వగ్రామం జగిత్యాల జిల్లా అంతర్గం లో అంత్యక్రియలు నిర్వహించారు. విరి వెంట కోరుట్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ గౌడ్,  కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతమ్ రాజాం, తదితరులు పాల్గొన్నారు.