కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన తెరాసా నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

Published: Thursday June 30, 2022

కోరుట్ల, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోనీ మాదాపూర్, కల్లూరు, జోగన్ పల్లి, పైడి మడుగు గ్రామం లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పొందిన లబ్దిదారుల ఇంటికి స్వయంగా  వెళ్ళి వారికి చెక్కులను ప్రదానం చేసి అలాగే  ఆడపడుచు కానుకగా చీరను  నియోజక వర్గ తెరాస యువ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ది దారులు మాట్లాడుతూ ఈ కళ్యాణ లక్ష్మి పథకం నిరు పేదల వరం అని, ఆర్థికంగా తమని ఎంతో ఆదుకున్నదని, ఈ పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి గారికి, నియోజక వర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని  లబ్ధి దారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి తోట నారాయణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట రావు, జెడ్పీటీసీ సభ్యురాలు ధారిషేట్టీ లావణ్య రాజేష్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు  దారిషేట్టి రాజేష్ , గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య,ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు,  కార్యకర్తలు పాల్గొన్నారు.