వికలాంగులకు సరుకులు పంపిణీ

Published: Thursday May 27, 2021
మేడిపల్లి, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా విపత్తులో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా బోడుప్పల్ ఇందిరా నగర్లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వికలాంగులకు మరియు అనాధ కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. దాత శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని సంయుక్తంగా నిరుపేద వికలాంగులకు, అనాధ కుటుంబాలకు పది రోజులకు సరిపడా బియ్యం, పప్పు, నూనె, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కారోనా విపత్కార పరిస్థితులలో వికలాంగులు, అనాధలు మరియు పేద వారు పడే కష్టాలను చూసి దాత శ్రీనివాస్ ట్రస్ట్ వారిని సంప్రదించి నిత్యవసర సరుకులు అందజేశారని శ్రీ లక్ష్మి ప్రసన్న ట్రస్ట్ ఫౌండర్, ఆధ్యక్షులు కుర్వ తమన్నా తెలిపారు. కరోనా విపత్తులో మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి వికలాంగులను, అనాధలను ఆదుకోవాలని ట్రస్ట్ అధ్యక్షులు కుర్వ తమన్నా విజ్ఞప్తి చేశారు. దాతలు వస్తు రూపంలో గాని ఇతర సహాయం చేయదలుచుకున్న వారు ఈ ఫోన్ నెంబర్ను 9177745159 సంప్రదించాలని ఆయన కోరారు.