అంబర్ పేట అసెంబ్లీ బీ బ్లాక్ ఎన్నికల అధికారిగా షేక్ మదర్ వలీ

Published: Wednesday June 08, 2022
మేడిపల్లి, జూన్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
కాంగ్రెస్ పార్టీ అంబర్ పేట అసెంబ్లీ బి బ్లాక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉప్పల్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు షేక్ మదర్ వలి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామక ఉత్తర్వులు అందజేసింది. ఈ సందర్భంగా షేక్ మదర్ వలి మాట్లాడుతూ అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.