కోరుట్ల లో తెలంగాణ రైతు గోస - బీజేపీ దీక్ష

Published: Wednesday May 26, 2021
కోరుట్ల బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఇందురి తిరుమల వాసు
కోరుట్ల, మే 25 (ప్రజపాలన ప్రతినిధి) : రైతులు పండించే వరిధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్న ప్రభుత్వం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామబాద్ ఎంపీ అరవింద్, జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్యనారాయణ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా దీక్ష చేయడం జరిగిందని కోరుట్ల పట్టణ మాజీ అధ్యక్షుడు ఇందూరి తిరుమల వాసు తెలిపారు. అకాల వర్షాలతో రైతు వ్యవసాయ మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకెళ్లి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని, తప్ప తలు పేరుతో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల వాసు మాట్లాడుతు ధాన్యం కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించాలి. తప్ప, తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలి, రైతు రుణమాఫీ అమలు చేయాలి, రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.