మాదిగ విద్యార్థులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

Published: Saturday November 20, 2021
బోనకల్, నవంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి: మాదిగ విద్యార్థుల సమాఖ్య బోనకల్ కాలేజ్ కమిటీని మాదిగ విద్యార్థి విభాగం నాయకులు చిలక నాగరాజ్ ఆధ్వర్యంలో గురువారం బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదిగ విద్యార్థులను ఉద్దేశించి చలో ఢిల్లీ కార్యక్రమం డిసెంబర్ 14 న మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సన్నాహక సమావేశం ఎస్సీ వర్గీకరణ మీద నిర్వహించి విద్యార్థులు మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మాదిగ విద్యార్థుల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యం యస్ యఫ్ కాలేజీ అధ్యక్షులుగా బంక ప్రేమ్ చందు, ఉపాధ్యక్షులుగా గుర్రం వేణు,ప్రధాన కార్యదర్శిగా దారెల్లి కుసుమ, కార్యదర్శిగా కనకపూడినిరోషా, కోశాధికారిగా దారెల్లి సతీష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట హనుమంతరావు, అధికార ప్రతినిధి తోటపల్లి చిన్న సైదులు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు తాటికొండ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.