రాయపోల్ గ్రామంలో స్వామీ వివేకానంద జయంతి

Published: Thursday January 13, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహంపట్నం మండలoలో బీజేపీ, బీజేయం మండల అధ్యక్షుడు దండే శ్రీశైలం ఆధ్వర్యంలో రాయపోల్ గ్రామ పంచాయతీ ఆవరణలో వివేకానంద 159వ జయంతి ఉత్సవాన్ని  నిర్వహించడo జరిగింది. ప్రపంచ దేశాలకు సైతం మన భారతీయ సనాతన ధర్మాలు, సంస్కృతి సాంప్రదాయాల చరిత్రను వారి ప్రసంగాలతో చాటి చెప్పిన యుగపురుషుడు స్వామి వివేకానందడని పోరెడ్డి అర్జున్ రెడ్డి మాట్లాడరు ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రంగా రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి. రాష్ట్ర నాయకులు ముత్యాల భాస్కర్, జక్క రవీందర్ రెడ్డి, నిట్టూ శ్రీశైలం, జిల్లా కార్యవర్గ సభ్యులు. గణేష్. విష్ణువర్ధన్ వేణు గోపాల్ రెడ్డి, రావుల మల్లేష్, శేకర్ రెడ్డి గారు. వివిధ మోర్చల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.