నిరుపేద విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

Published: Tuesday June 28, 2022

ఇబ్రహీంపట్నం, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ గ్రామంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి విద్యార్థినులు ను ఆదుకోవాలని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోనీ విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు 23 మూడు విద్యార్థి విద్యార్థులకు లాంగ్ నోట్ బుక్స్ మరియు స్టేషనరీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ,సురగి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నిరుపేద విద్యార్థులకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని మా వంతు సాయంగా అత్యంత దయనీయ స్థితిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సురిగి శ్రీనివాస్ గౌడ్, రాంప్రసాద్, భగత్, మణిదీప్ , విక్కీ మరియు పాఠశాల ఉపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, కృష్ణ ప్రసాద్, మురళి, ఇమ్మానియేల్,ఇబ్రహీం, మమత, భాగ్యలక్ష్మి,, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.