స్వామి వివేకానంద 159 వ జయంతి

Published: Thursday January 13, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి : విరపట్నం మంచాల మండలం కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా విద్యార్థుల, కార్యకర్తలతో సమీక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఏబీవీపీ ఎస్ ఎఫ్ డి కన్వీనర్ మాట్లాడుతూ ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమైన మనస్సు గల యువతీ, యువకులుగా తీర్చిదిద్దే విధంగా ప్రేరణగా నిలిచిన స్వామి వివేకానంద అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజవార్డాన్, రాజేష్, పవన్, కార్యకర్తలు పాల్గొన్నారు.