పెన్షన్ గుర్తింపు కార్డులను అందించిన ఎమ్మెల్యే

Published: Friday September 09, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో ఎంపిక చేసిన 268 మంది లబ్ధిదారులకు గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 60 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, ప్రస్తుతం 57 సంవత్సరాల వారికి కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెన్షన్ దారులందరూ రుణపడి ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత ,వైస్ చైర్మన్ బి, సుదర్శన్,కౌన్సిలర్లు షేక్ అస్మా, సురేష్ ,గొసిక రమేశ్ , సుకేసిని భరత్వాజ్ , గెల్లి రాజలింగు,నీలి కృష్ణ , అధ్యక్షుడు బొడ్డు నారాయణ, వునూనేటి సత్యనారాయణ మరియు ఇతర కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.