వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం...

Published: Wednesday March 17, 2021
జగిత్యాల, మార్చి 16 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు కొలుగూరి దామోదర్ రావు అధ్యక్షతన మంగళవారం రోజున సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరమునకు గాను బడ్జెట్ ప్రతిపాదనకు పలు అంశాలు చర్చించారు. చలిగల్ మామిడి మార్కెట్ షెడ్ల నిర్మాణము పూర్తి చేయుటకు రెండు కోట్లు రూపాయలను ఋణముగా ములుగు నర్సంపేట్ మరియు కథలపూర్ మార్కెట్ కమిటీ ద్వారా పొందుటకు తీర్మానంపై చర్చించారు. షెడ్లు ఏప్రిల్ మాసంలో పూర్తి చేసి వ్యాపారులకు రైతులకు అందుబాటులోకి తీసుకోవాలని పేర్కొన్నారు. మామిడి మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిధుల కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్: సంజయ్ కుమార్ మార్కెట్ సంచాలకులు మరియు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.ఏ.ఎస్ చైర్మన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి డైరెక్టర్లు బండారి విజయ్ చిర్ర నరేష్ పుల్లె మల్లయ్య చెక్కపెల్లి మోహన్ రెడ్డి చెట్లపెల్లి మోహన్ రెడ్డి పురిపాటి లక్ష్మీ మార్కెట్ సెక్రటరీ టీ. రాజశేఖర్ తదితరులు  పాల్గొన్నారు.