మున్సిపాలిటీ ప్రజలందరూ సహకారంతోఅభివృద్ధి తోముందుకెళ్తున్న మధిర జిల్లా పరిషత్ చైర్మన్ లిం

Published: Monday January 30, 2023
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నే మధిర పట్టణ అభివృద్ధి.
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్ గారికి ప్రజలంతా మద్దతుగా నిలవాలి ప్రజలందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాలని గుడ్ మార్నింగ్ మధిర చేపట్టాం.మధిర పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నిలుపుతాం. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ట్యాంక్ బండ్ సహా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, సెంట్రల్ డివైడర్ లైటింగ్ తో పాటుగా పట్టణ సుందరికరణ చేశాం
ఎన్నికల సమయంలో వచ్చి మాయ మాటలు చెప్పే వారికి తగిన గుణపాఠం చెప్పి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి
మున్సిపాలిటీలో పలు వార్డుల్లో మూడో వార్డు అంబర్ పేట ప్రజాప్రతినిధులకు కలిసి జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు వార్డుల్లో ఉన్న సమస్యలపై ఉదయాన్నే ప్రజాప్రతినిధులతో కలిసి వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలపై తెలుసుకుంటూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నే మధిర పట్టణ అభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్మన్, బీ.ఆర్.ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు ఆదివారం నాడు మధిర పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అందులో భాగంగా పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత మరియు వార్డు కౌన్సిలర్ల తో కలసి మార్నింగ్ వాక్ చేస్తూ వార్డులు మొత్తం కలియ తిరిగారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం తో పాటుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజల తో చర్చించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అందరు సహకారంతో కెసిఆర్ కేటీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ నామ నాగేశ్వరావు రాజ్యసభ సభ్యులు అందరు సహకారంతో మున్సిపాలిటీకి అభివృద్ధిలో తీసుకొని నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షుడు కార్యదర్శి వెంకటేశ్వర శ్రీనివాస్ కృష్ణ ప్రసాద్ కోటేశ్వరావు బి వి ఆర్ సుధాకర్ కమిషనర్ రమాదేవి పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు