యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు : ఎస్సై నరేష్

Published: Friday February 11, 2022
బెల్లంపల్లి, ఫిబ్రవరి 10, ప్రజాపాలన ప్రతినిధి: యువకులు మత్తు పదార్థాలకు, మారక ద్రవ్యాలకు అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంచిర్యాల జిల్లా కాసిపేట ఎస్సై నరేష్ అన్నారు. గురువారం నాడు స్థానికంగా ఏర్పాటు చేసిన మత్తుపదార్థాల వినియోగం, అనే అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువకులు చదువు మీద ద్రుష్టి పెట్టాలని మందు, గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని వాటికి బానిస ఐ జీవితాన్ని పాడు చేసుకొని తల్లీ దండ్రులను బాధ పెట్టొద్దని ఆయన ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్ తోపాటు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.