కౌన్సిలర్ల వేతనాల పెంపు పట్ల మల్లాది వాసు సవిత దంపతుల హర్షం

Published: Saturday November 20, 2021
మధిర నవంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధిరాష్ట్ర వ్యాప్తంగా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్ల వేతనాల పెంపు పట్ల మధిర మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులు హర్షం వ్యక్తం చేశారు. మధిర మున్సిపాలిటీలో గతంలో కౌన్సిలర్ కి 2500 రూపాయలు గౌరవ వేతనం ఉండగా, దాన్ని 3,250 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని వారు తెలిపారు. అదేవిధంగా మధిర మున్సిపల్ చైర్ పర్సన్కు 12 వేల రూపాయలు ఉన్న వేతనాన్ని 15,600 వైస్ చైర్ పర్సన్ వేతనం ఐదు వేల నుండి 6500 రూపాయలకు పెంచటం జరిగిందని వారు తెలిపారు. ఈ పెంపు జూన్ ఒకటో తేదీ నుండి అమలులోకి వస్తుందని వారు వెల్లడించారు. పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గౌరవ వేతనం పెంపు పట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కి వారు కృతజ్ఞతలు తెలిపారు.