ప్రభుత్వ ఆసుపత్రికి అల్మారా తో పాటు N 95 మస్కు లను అందచేసిన... హోప్ ఫౌండేషన్

Published: Saturday May 29, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి హోప్ ఫౌండేషన్ చైర్మైన్ కొండ విజయ్ కుమార్ అల్మారాతో పాటు ఎన్ 95 మస్కులను అందచేయడం జరిగింది. గురువారం ఆసుపత్రిలో నిరవహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మైన్ కొండ విజయ్, ఆసుపత్రి డాక్టర్ రామిరెడ్డి అల్మారా తాళాలుతో పాటు సిబ్బంది కోసం ఎన్95 మస్కులను అందచేయడం జరిగింది. కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందచేస్తున్న వైద్య సిబ్బంది సేవలను కొండ విజయ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాండు యాదవ్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.