అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ సిడిపిఓ వీరభద్రమ్మ
Published: Wednesday June 08, 2022
మధిర జూన్ 7 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు స్థానికఅంగన్వాడీ కేంద్రాలను గర్భిణీ స్త్రీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని మధిర ఐసిడిఎస్ అడిషనల్ సిడిపిఓ వీరభద్రమ్మ కోరారు. మంగళవారం మధిర వన్ సెక్టార్ లోని నాలుగవ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రీస్కూల్ విద్యార్థులందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఆమె కోరారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించటంతో పాటు నిరంతరం అంగన్వాడి టీచర్లు ఆయాల పర్యవేక్షణలో చిన్నారులకు విద్యను బోధిస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జె. విజయలక్ష్మి ఆయా అంజమ్మ పాల్గొన్నారు.
Share this on your social network: