కుమ్మరి పల్లి ఆదర్శ పాఠశాలలో బోధించుటకు ఉపాధ్యాయ ఖాళీలు : ప్రిన్సిపాల్ కె శ్రీనివాస్.
Published: Wednesday October 27, 2021
వెల్గటూర్, అక్టోబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి ఆదర్శ పాఠశాలలో పిల్లలతో విద్యాబోధనకు తెలుగు హిందీ సాంఘిక శాస్త్రము పి.జి టి. బాటని ఆంగ్లము బోధించుటకు ఉపాధ్యాయ కాలిలు ఉన్నవి అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉపాధ్యాయ బిఈడి ఉత్తీర్ణులై ఉండాలి ఆంగ్లము బోధించుటకు సంసిద్ధులై ఉండాలి ఈనెల 31-10-2021 పాఠశాలలో సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలియజేశారు.
Share this on your social network: