పందుల సమస్య పై ప్రజా ప్రతినిధులు స్పందించరా బిజెపి పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఏలూరు నాగేశ్

Published: Thursday December 08, 2022
డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మున్సిపాలిటీలో పలు సమస్యలు పందుల సమస్యలపైప్రజల సమస్యలు మధిర ప్రజా ప్రతినిధులకు పట్టవా.మధిర పేరు రాష్ట్ర స్థాయిలో మారు మొగుతుంది..ఇక్కడి నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే ఘనులు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవటం లో మాత్రం శూన్యం.. మల్లు భట్టివిక్రమార్క శాసనసభ పక్షనేత,లింగాల కమల్ రాజు జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలు కానీ వీళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు.మున్సిపల్ పాలకవర్గంలో, మధిరరాజకీయాల్లోతలపండినఉద్దండులు,కౌన్సిలర్లు.ఉన్న,ఎవరు ప్రజల సమస్యలపై దృష్టి సారించటం లేదు.. ఎలక్షన్లప్పుడు ప్రజల మీద ప్రేమ చూపిస్తారు అంతే.. ఓ ప్రజా ప్రతినిధులరా ప్రజల ఓట్లతో గెలిచి, వాళ్ళను విస్మరిస్తే ప్రజా తీర్పును ఎదుర్కొక తప్పదు...ప్రజల సమస్యలు పరిష్కరించాలని, బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.