పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

Published: Monday September 20, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ ఎమ్మెల్యే క్వార్టర్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నిర్వహించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు యాదవులకు, గొల్ల కురుమ సోదరుల అభివృద్ధి కి చేపట్టిన పథకం గొర్ల పంపిణీ పథకం అన్నారు. గొర్ల ధరలు పెరిగినందున ప్రభుత్వం ఒక్కో యూనిట్ దరని 1,25,000 నుండి 1,75,000 వేల వరకు పెంచిందని డిడి లు కట్టిన వారు యూనిట్ కి 12,500 అదనంగా వారం రోజుల్లో చెల్లించాలని అన్నారు. జిల్లా లో 2031 డిడి లు పెండింగ్ లో ఉండగా జిల్లాలో 322 మంది యూనిట్ కి అయ్యే అదనపు మొత్తం చెల్లించారని, నియోజకవర్గంలో 57 మంది మాత్రమే అదనపు మొత్తం చెల్లించారని నియోజకవర్గంలో 497 మందివి ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలపగా మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎమ్మెల్యే మాట్లాడగా వారం రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారని పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డివి హెచ్ఓ శ్రీదర్, అధికారులు శ్రీనివాస్, నరేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సునీల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.