సైకిల్ యాత్ర చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త కు స్వాగతం పలికిన బీపీ నాయక్
Published: Monday February 07, 2022
బోనకల్, ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి: జల్ జమీన్ మిషన్ ప్రముఖ సామాజిక కార్యకర్త రిటైర్డ్ లయన్ సుభాష్ చంద్ర శేఖర్ సేవ్ వాటర్, సేవింగ్ ఎన్విరాన్మెంట్ అంటూ భారతదేశమంతటా సైకిల్ యాత్ర నిర్వహిస్తూ యాత్రలో భాగంగా ఆదివారం బోనకల్ గ్రామంలో ప్రవేశించడం జరిగింది, ఈ సందర్భంగా బీజేపీ యువనేత ఎన్నారై బీపీ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి మండల ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్ మరియు ఇతర స్నేహితులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం బి పి నాయక్ ప్రముఖ సామాజిక కార్యకర్త సుభాష్ చంద్ర శేఖర్ ను ఇంటర్వ్యూ చేసి యాత్ర విషయాలు మిషన్ లక్ష్యం, అతని ఆరోగ్య విషయాల గురించి తెలుసుకున్నారు. అతనికి మార్గమధ్యంలో అవసరమయ్యే పండ్లు మంచినీళ్లు అందించి అభినందనలు తెలిపారు.
Share this on your social network: