నేటితో 30తో ముగియనున్న ఇంటర్ అడ్మీషన్ల గడువు

Published: Tuesday November 30, 2021
కాగజనగర్, నవంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : ఇంటర్మీడియేట్ అడ్మీషన్ల గడువు నవంబర్ 30వ తేదీతో ముగియనున్నట్లు జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మీషన్లకు చివరి అవకాశంగా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు స్పష్టం చేసారు. గడువు తేదీలోగా ప్రైవేట్ మరియు ప్రభుత్వరంగ కళాశాలల విద్యార్థుల గుర్తింపు ఫీజు సైతం చెల్లించాలని అన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశాల మేరకు మొదటి సంవత్సరం జనరల్ మరియు ఒకేషనల్ గ్రూపుల అడ్మీషన్లకు కేవలం ఈ నెల 30 వ తేదీ వరకు మాత్రమే పెంచడం జరిగిందని అన్నారు. కళాశాలల్లో గతంలో చేరిన వారి ఫోటో, సంతకం తదితర వివరాలను సైతం గడువు లోగా నవీకరించాలని అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 11 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రభుత్వ రంగ మరియు 6 ప్రైవేట్ కళాశాలలు మొత్తం 40 కళాశాలలున్నాయని, ఆయా కళాశాలల్లో అడ్మీషన్ పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.