విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ... బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాదాసి రవీందర్. మంచి

Published: Thursday August 25, 2022
బాసర లోని ట్రిబులైటీ లో నెలకొన్న సమస్యలను పరిస్కరించలేని విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాదాసి రవీందర్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఉన్నత విద్యావిదానం అస్థావ్యస్థంగా ఉందనడానికి బాసర ట్రిబ్యులైటీ సమస్యలే సాక్ష్యం అని అన్నారు. గత కొద్ది కాలంగా ట్రిబులైటీ లోని సమస్యలు పరిస్కరించాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం కు చీమకుట్టినట్లు అయినా లేదని అన్నారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నే సురేష్ రాథోడ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విమర్శించారు. విద్యాలయం లో కనీస సౌకర్యంలు కల్పించకుండ విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురి చేయటం వలనే వారు చనిపోతు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి చావుకు భాద్యులను సస్పెండ్ చేయాలని, మృతుని కుటుంబానికి యాబై లక్షలు ఎక్సగ్రెసియా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
 
 
Attachments area