చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
Published: Tuesday September 27, 2022
రాయికల్, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణంలో చాకలి (చిట్యాల)ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు,రజక సంఘ సభ్యులు,స్థానికనేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే రాయికల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అభివృద్ధి అధికారి గంగుల సంతోష్ కుమార్,వైస్ ఎం.పి.పి, ఎంపీటీసీలు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: