రైతులకు చేస్తున్న సేవలకుగాను కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Wednesday June 16, 2021
మల్లాపూర్, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు సీజన్‌ కు రూ 5 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు పక్షాన కేసీఆర్‌ సర్కారు నిలుస్తుందని మల్లాపూర్ మండల జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతున్న సందర్భంగా మంగళవారం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం ఆవరణలో కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీ కవితక్క, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పాలాభిషేకంలో జడ్పిటిసితో పాటు మండలంలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ రైతులకు చేస్తున్న సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కదుర్క నర్సయ్య, మండల టి ఆర్ యస్ అధ్యక్షులు తోట శ్రీనివాస్, సిరిపూర్ ఎంపిటిసి ఏనుగు రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్ధం శరత్ గౌడ్, రంగు రామగౌడ్, క్యాతం జీవన్ రెడ్డి, బండి లింగస్వామి గౌడ్, క్యాతం సురేష్, సోమా అశ్విన్ కుమార్, బొక్కల నాగరాజు, డబ్బ రమేష్, మేకల సతీష్, మండలంలోని రైతులు పాల్గొన్నారు.