ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం

Published: Tuesday March 09, 2021
మధిర, మార్చి 08 ప్రజాపాలన ప్రతినిధి : ప్రపంచ మహిళా దినోత్సవo సందర్భంగా స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలోమహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తెలుగు శాఖాధిపతి శీలం ఇందిర, హింది శాఖాధిపతి అమలాదేవి, ఆఫీస్ సబార్డినెట్ పుణ్యవతి లను శాలువా మరియు పుష్ప గుచ్చెo తో సత్కరించారు. విద్యార్థిని విద్యార్థులకు పాటలు, వక్రుత్వ పోటీలు నిర్వహించి గెపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శాస్ర్తీ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ఉన్న అవకాశాలను అంది పుచ్చుకుని ఎదగాలని, మహిళల సాధికారత సాధించి నపుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.ఆంగ్ల శాఖాధిపతి రవికుమార్ మహిళా ఉద్యోగులకు సుభాకాంక్షలు తెలిలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ. ఎల్.ఎన్. శాస్ర్తీ. కె. రవికుమార్, డా.పి. రఘునందన్, అమాలదేవి, ఎస్. ఇందిర,పుణ్యవతి, ఆఫ్రోజ్, జయరాజ్, లక్ష్మీనారాయణ,కె. వి. ఆర్. పాల్గొన్నారు.