సిలెండర్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి - ఎమ్మెల్యే సంజయ్ ధర్నా రాస్తారోకో

Published: Saturday March 04, 2023

బీరుపూర్, మార్చి 03 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించి పీఎం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తు వంటావార్పు నిరసన వ్యక్తంచేస్తు దేశంలో రాష్ర్టంలో ప్రతి సామాన్యుడు వాడే నిత్యావసర వస్తువుల ధరలపై జి.ఎస్టి. మోపి నడ్డి విరిచారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో ముప్పాల రాంచందర్ రావు కొలుముల రమణ నారపాక రమేష్ గర్షకుర్తి శిల్పరమేష్ మహిపాల్ రెడ్డి ముక్క శంకర్ పుడూరి సుధాకర్ రిక్కల ప్రభాకర్ మారుతి ఏసుదాసు రామక్రిస్టు గంగాధర్ బి.ఆర్.ఎస్. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.