కళ్యాణలక్ష్మి ఆడపడుచులకు వరం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Thursday September 23, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలానికి చెందిన 31 మంది ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ ద్వారా మంజూరైన 31,03,596/- లక్షల విలువగల రూపాయల చెక్కులను బీరుపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జిల్లా కెడిసిసి మెంబర్ ముప్పాల రామచందర్ రావు మండల్ పార్టీ అధ్యక్షుడు నారపాక రమేష్ ప్యాక్స్ చైర్మన్ నవీన్ రావు రైతుబందు మండల కన్వీనర్ మెరుగు రాజేశం సర్పంచులు గర్షకుర్తి శిల్పరమేష్ నల్ల మహిపాల్ రెడ్డి రిక్కల ప్రభాకర్ మేసు ఏసుదాసు సిపతి రమేష్ ఎలగందుల లక్ష్మీ చిక్రం సుగుణ చుంచు శారద పర్వతం రమేష్ అజ్మీర ప్రభాకర్ బోడ స్వప్న బందెల మరియా ఎడ్ల సృజన ఉప సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.