కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన ఎమ్మెల్యే

Published: Monday May 09, 2022
బెల్లంపల్లి మే 8 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గం లోని కన్నెపల్లి మండలానికి చెందిన 19 మంది లబ్ధిదారులకు పంతొమ్మిది లక్షల రెండు వేల రెండు వందల నాలుగు రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయం లబ్ధిదారులకు అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య . ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ టి, సత్యనారాయణ, మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బి, సుదర్శన్, ప్రమీల గౌడ్, శ్రీధర్, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు మహేష్ గౌడ్, నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.