అవెన్యూ ప్లాంటేషన్ కు ఆర్థిక చేయూత

Published: Saturday July 30, 2022

వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజాపాలన :

తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కొరకు పెద్ద సైజు నాణ్యమైన మూడు వేల మొక్కలు నాటేందుకు సిఎస్ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ) క్రింద రూ. 4.50 ల చెక్కు ను బ్యాంక్ అధికారులు జిల్లా కలెక్టర్ నిఖిలకు అందజేశారు. ఇట్టి నిధులతో నాణ్యమైన పెద్ద సైజు మొక్కలు కొనుగోలు చేసి జిల్లాలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలియజేసినారు. ఇట్టి సహకారానికి జిల్లా కలెక్టర్ నిఖిల బ్యాంక్ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యల్ డి యం రాంబాబు, యస్ బి ఐ చీఫ్ మేనేజర్ అనుప్రభ, డి ఆర్ డి ఓ కృష్ణన్, సి ఏ సి మేనేజర్ రామాంజనేయులు, యస్ బి ఐ ఫీల్డ్ ఆఫీసర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.