కరోనా ఎక్స్ గ్రేషియాచెక్ అందజేత
Published: Thursday February 24, 2022
నస్పూర్, ఫిబ్రవరి 23, ప్రజాపాలన ప్రతినిధి: శ్రీరాంపూర్ ఏరియాలోని పర్సనల్ డిపార్ట్మెంట్ లో సర్ఫేస్ జనరల్ మజ్జుర్గా పనిచేస్తూ ఇటీవల కరోనాతో మరణించిన మెరుగు ఎల్లయ్య కుటుంబ సభ్యులకు సింగరేణి తరఫున ఇచ్చే 15 లక్షల రూపాయల చెక్కును శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. సురేష్ చేతులమీదుగా ఆయన భార్య మెరుగు మాధవికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం కె.హరి నారాయణ గుప్తా, డీజీఎం (పర్సనల్) పి . గోవిందరాజు, సీనియర్ పీఓ పి.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: