ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిన మధిర మున్సిపాలిటీ పాలకవర్గం : పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుమి

Published: Wednesday December 15, 2021

మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడుతూ మధిర పట్టణంలో గత కొంత కాలంగా కొండముచ్చుల బెడద విపరీతంగా పెరిగిపోయిందని మనుషులపై దాడి చేస్తూ సుమారు 50, 60 మందిని గాయపరిచిన మధిర మున్సిపాలిటీ వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలని గాలికి వదిలేశారు ప్రజలను పట్టించుకున్న నాథుడు లేడు. మధిర పట్టణంలో ఏ వీధిలో చూసినా పందులు, కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మనుషులపై దాడి చేస్తున్నాయి పందుల నివారణకు మధిర మున్సిపల్ పాలకవర్గం చేతులెత్తేసింది. పందుల పెంపకం దారులతో లోపాయీకారి ఒప్పందం చేసుకొని పందులను ఊరిమీదకు వదిలేసారు. ప్రజలను పట్టించుకోవాల్సిన పాలకవర్గం విందులు, వినోదాలతో పక్క రాష్ట్రాల్లో కాలం వెళ్లదీస్తూ ఇంకా ఆ మత్తు దిగక ప్రజల్ని పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలో కాలువలు తీసే వారు లేరు మధిర పట్టణం, అంబారుపేట, మడుపల్లి ఏ వీధిలో చూసినా గత ఇరవై రోజుల నుంచి చెత్తతీసుకుపోవటం లేదు. కాలువలు శుభ్రం చేయక దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు ఇకనైనా మునిసిపాలిటీ వారు స్పందించి తగు చర్యలు తీసుకొని ప్రజల్ని కాపాడకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన చేయడానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కౌన్సిలర్ మునుగోడు వెంకటేశ్వర్లు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరంపల్లి చంటి, కాంగ్రెస్ నాయకులు తలుపుల వెంకటేశ్వర్లు, ఆదిమూలం శ్రీనివాసరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరువీధుల వెంకటేశ్వర రావు మొదలగు వారు పాల్గొన్నారు