బూర్గంపాడు మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ .

Published: Saturday October 15, 2022
బూర్గంపాడు మండలం( ప్రజా పాలన)
.భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం లో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సోమశేఖర శర్మ ఈ రోజు  ఎంపీపీ ఎస్ పోలవరం, పిఎస్ నకిరి పేట ,యుపిఎస్ టేకుల చెరువు పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా FLN  ను వివరించడం  జరిగింది. మరియు పోలవరం పాఠశాలలో FLN   సరిగా ఇంప్లిమెంట్ లేనందున ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వమని మండల విద్యాశాఖ అధికారిని ఆదేశించడం  జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అని, వారిని అడిగి తెలుసుకోవడం జరిగినది. ఈ సందర్శనలో  సెక్టోరల్ ఆఫీసర్ సై దులు  మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  K.వెంకటేశ్వర్లు  పాల్గొనడం జరిగింది.
 
 
 
Attachments area