రిపోర్టర్ జమీర్ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎన్టీవీ యాజమాన్యం

Published: Thursday August 04, 2022

జగిత్యాల, ఆగస్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి): వార్త సేకరణకు వెళ్లి వరదల్లో చిక్కుకుని మరణించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీరుద్దీన్ కుటుంబానికి ఎన్టీవీ యాజమాన్యం 5 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఎన్టీవీ కుటుంబ సభ్యుడు అయిన జమీరుద్దీన్ కుటుంబానికి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎన్టీవీ చైర్మన్ నరేందర్ చౌదరి కుటుంబ సభ్యులకు తెలిపారు.ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయం అందేలా చూస్తామని హమీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీమ్,ఎన్టీవీ ముక్యులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.