సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీపీ సద్ది ప్రవీణ

Published: Tuesday May 04, 2021

గుమ్మడిదల, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలం లోని వీరన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మమతా వేణు, ఎంపిటిసి నాగేందర్ గౌడ్, వార్డు సభ్యులతో కలసి పరిశీలించారు, ఈ సందర్భంగా ఎంపీపీ ప్రవీణ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ ఉండదని కచ్చితంగా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని కాంట్రాక్టర్ మరియు గ్రామ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని ఆమె మరో సారి గుర్తు చేశారు, అలాగే పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారాలు అందిస్తున్నారని, అందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, అలాగే  ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కూడా వారితో చర్చించడం జరిగిందని త్వరలోనే పనులను ప్రారంభించే దిశ గా ముందుకు వెళుతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు ఏజాజ్ పాష, గిరి, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు