ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు 3 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ

Published: Friday September 24, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 23, (ప్రజాపాలన ప్రతినిధి): ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు 3 కోట్లతో గొల్లపల్లిరోడ్, మోతే స్మశాన వాటికలో అభివృద్ధి పనులను సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి.రవి, జెడ్పి చేర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ చేర్పర్సన్ డా.బోగ.శ్రావణి ప్రవీణ్ భూమిపూజ చేసినారు. వారు మాట్లాడుతూ పట్టణమునకు గొల్లపల్లి రోడ్, మోతె రోడ్ వైకుంఠదా మాముల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి ద్వారా 3 కోట్ల నిధులు మంజూరు చేశారని, వీటి ద్వారా బర్నింగ్ ప్లాట్ఫామ్, పాత్ వే, గ్రీనరీ, కమాన్, డ్రైనేజి సిస్టమ్, ఎలక్ట్రిక్ క్రిమిటోరియం, టాయిలెట్, లైటింగ్ వివిధ చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి సూచనలు, సలహాలు అందజేశారు. పట్టణములోని వివిధ వైకుంఠదామముల అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని వాటి కొన్ని పూర్తి చేసి వినియోగములోకి తీసుకువచ్చామని తెలిపారు. పట్టణ ప్రజలందరికి ఇబ్బందులు కలగకుండా అన్ని విధములుగా చర్యలు చేపడుతున్నామని, ప్రజలందరూ సహకరించాలని కొరినారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.ఆరుణశ్రీ, కమిషనర్ స్వరూప రాణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, గౌరవ కౌన్సిలర్లు, కో.అప్షన్ మెంబర్లు, తెరాస నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.