హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు

Published: Thursday March 18, 2021
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి16, ప్రజాపాలన : లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన తోకల గంగయ్య అనే నిందితునికి బుధవారం మంచిర్యాల జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి డి.వెంకటేష్  జీవితఖైదుతో పాటు ఐదు వందల రూపాలయ జరిమానా విధించారు. నిందితుడు 2019వ సంవత్సరం జూలై 1న వరుసకు అన్న అయిన తోకల మల్లయ్యను ఇంటి సరిహద్దు విషయంలో దుడ్డుకట్టెతో కొట్టి చంపగా మృతుని బార్య తోకల లక్ష్మి పిర్యాదుతో అప్పటి ఎస్సై మదుసుదన్ రావు కేసు నమోదు చేశారు. లక్సెట్టిపేటలో ఉన్నటువంటి ప్రస్తుత సిఐ నారాయణ నాయక్ ఈ కేసు పూర్తి దర్యాప్తు చేపట్టి నిందితున్ని కోర్టులో హజరు పర్చగా అడీషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోముల రాజ్కుమార్, సీడీఓ రాములు సుమారు పది మంది సాక్షులను ప్రవేశపెట్టడంతో నేరం ఋజువుకాగా మెజిస్ట్రేట్  నిందితుడు తోకల గంగయ్యకు ఈ శిక్ష ఖారారు చేసారు.