బైశాఖీ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి తలసాని... అమీర్ పేట్ (ప్రజాపాలన

Published: Tuesday January 10, 2023

సద్ సంగత్ & ప్రభందక్ కమిటీ గురుద్వారా సాహెబ్ అమీర్ పేట్ వారు నిర్వహించిన బైశాఖీ క్రికెట్ టోర్నమెంట్ , ఇతర ఆటల పోటీల ముగింపు వేడుకలు అమీర్ పేట్ జీ హెచ్ ఎం సీ గ్రౌండ్ లో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై కమిటీ వారిని అభినందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే ఆటల పోటీలు,క్రికెట్ టోర్నమెంట్ పెద్ద ఎత్తున జరగాలని,ఈ రకంగా కుటుంబ సభ్యులు పాల్గొంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అని అన్నారు.కమిటీ వారు యువత కి క్రికెట్ టోర్నమెంట్ మరియు మహిళల కోసం మ్యూజికల్ చైర్,లెమన్ స్పూన్ ఆటలు నిర్వహించారు.నిర్వహుకులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తన తరుపున లక్ష రూపాయలు బహుమానం, రెండు క్రికెట్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శేషు కుమారి ,అశోక్ యాదవ్,సురేందర్ రాజు సింఘ్,అనంజిత్ కౌర్, సుమిత్ సింగ్,జోగిందర్ సింగ్  నిర్వాహకులు బల్వేందర్ సింగ్,మౌంటీ సింగ్, సత్బిర్ సింగ్,ఇంద్రపాల్ సింగ్ మరియు గురుద్వారా అధ్యక్షులు భాగిందర్ సింగ్ ,కార్యదర్శి సురేందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.