ప్రభుత్వ ఉద్యోగులందరు సమయపాలన పాటించాలి
Published: Saturday March 04, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 మార్చి ప్రజాపాలన : జిల్లా అధికారి స్థాయి నుండి అటెండర్ వరకు ప్రతి ఒక్క ఉద్యోగి పద్ధతి ప్రకారంగా సమయపాలన పాటించి మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు . శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:20 గంటలకు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి యాక్సెస్ కార్డు ద్వారా బయోమెట్రిక్ సిస్టంను ప్రారంభించారు. ఈ మాసం జీతం అటెండెన్స్ యాప్ ఆధారంగా చెల్లించబడతాయని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.
Share this on your social network: