సోనియా గాంధీ నిర్ణయంతోనే తెలంగాణ కల నెరవేరింది : సత్యనారాయణ రావు

Published: Saturday December 10, 2022
ప్రజా పాలన -శేరిలింగంపల్లి /డిసెంబర్ 10 న్యూస్ :సోనియా గాంధీ నిర్ణయంతోనే తెలంగాణ కల నెరవేరిందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ పిసిసి డెలిగేట్ సత్యనారాయణ రావు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పిసిసి డెలి డెలిగేట్ సత్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం అయినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా హిమాచల్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ భారీ మెజార్టీతో గెలిపించి గిఫ్ట్ గా ఇచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలన చూసి రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని, తెలంగాణ రాష్ట్రంలో యువత మేధావులు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చూస్తున్నారని రాబోయే రోజులలో ముఖ్యమంత్రి సీటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, గోల్కొండ కోటలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని సత్యనారాయణ రాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సత్య నారాయణ రావు శేరిలింగంపల్లి నియోజక వర్గ పి.సి.సి. డెలిగేట్, సమీర్ కౌషల్..పి.సి.సి కార్యదర్శి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, మియాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఇంలీయాస్ షరీఫ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు భరత్ గౌడ్. కే శశికాంత్, మహమ్మద్ జమీర్, సురేష్ నాయక్, భరత్, అనిల్, ఈశ్వర్ రావు, ముఖ్యం రెడ్డి, సూర్య ప్రకాష్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.